
© 2026 Vivek Store. All rights reserved.
జాగృత భారతం ( భారతదేశ భాగ్యోదయానికి స్వామి వివేకానందుని మార్గదర్శకాలు ) స్వామి వివేకానంద ఆధునిక భారతదేశంలో జన్మించిన ఒక విశిష్ట వ్యక్తి అనడానికి ఏమాత్రము సందేహము అక్కరలేదు. స్వామీజీ సందేశాలు మానవాళి అందరికి ఆచరణయోగ్యాలు. నేటి భారతావని ప్రగతిపథంలో ముందు ఉండి, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేందుకు చేయవలసిన కార్యాచరణ మార్గాలను ప్రజలలోని ప్రతీ వర్గానికి స్వామీజీ సందేశాల రూపంలో అందజేసిన పలుకులను గ్రంథస్తం చేసినది ఈ పుస్తకం. యువతకు, సంఘ సంస్కర్తలకు, విద్యావేత్తలకు, మహిళలకు, జనబాహుళ్య ఉద్ధరణకు, భారతజాతి వైభవ పునరుద్ధరణకు స్వామీజీ మాటలలోనే వారి సందేశాలను ఇందులో చేర్చటం జరిగింది.